జులై 2015
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
ఇది ప్రతి మనిషిలొ ఉండే సమస్య అయినప్పటికి ప్రతీ వ్యక్తి వివిధ రకముల శరీరం కలిగి ఉండటం వల్ల, మనిషికి ఒకరికీ మరొకరికీ మద్య మార్పు ఉంటుంది.
శరీర దుర్వాసన, చెమట మరియు ఇతర చర్మ స్రవాలు వల్ల వస్తుంది.  ఇది మిమ్మల్ని స్నేహితుల లేదా ఇతర  సమావేశాల నుంచి దూరం చేస్తుంది. మీరు ఎలాంటి కోవకు  చెందిన వారైనను, ఈ చెడు వాసన మీతో ఉన్నవారినే కాదు మిమల్ని కూడా ఎంతో ఇబ్బందికి  గురిచేసి అసౌకర్యాన్ని కలిపిస్తుంది.

     ఈ దుర్వాసన మన శరీరంలో  “eccrine” మరియు “apocrine” అనే  గ్రంధుల వల్ల వ్యాపిస్తుంది.

మొదటిగా శరీరం అంతటా వ్యాపించి ఉన్ననూ ముఖ్యంగా చేతులు పై, చేతుల కింది భాగము, చంకలు, అరికాళ్ళు, నుదురు పై ప్రభావం చూపిస్తాయి. తరువాత తొడల మధ్య చేరి ఎంతో ఇబ్బందిని కలిగిస్తాయి.

మార్కెట్లో ఎన్నో రకముల వివిధ ఉత్పత్తులు ఉన్నను అవి  తాత్కాలిక రక్షణ మాత్రమే ఇస్తాయి, కానీ ఈ సమస్యకు శాస్వత పరిష్కారం ఎంతో అవసరం.

 Deodorants, perfumes ఈ దుర్వాసనను కొంతవరకు తగ్గించినా శాస్వత పరిష్కారం ఎంతో అవసరం. వ్యక్తి యొక్క మానసిక మరియు భావోద్వేగ  ఒత్తిడి వల్ల కూడా ఈ దుర్వాసన వ్యాపిస్తుంది

చెడు వాసనకు కారణం:

పరిశుభ్రత సమస్య: మనం నివసించే ప్రదేశం శుబ్రంగా లేకపోయినా,స్నానము సరిగా  చెయకపొయినా, పరిశుభ్రమైన బట్టలు వేసుకోకపోయిన, ఎంతో  చిన్నవిగా అనిపించే ఇవి మన శరీర దుర్వాసనకు కారణం అవుతాయి

చర్మం సమస్య: చెడు వాసనకు కారణములలొ మరొకటి చర్మ సమస్యలు,  “eczema” లేదా “psoriasis” అనే  అలెర్జీలు ఉంటే నిర్దారించుకుని డాక్టరు ని సంప్రదించడం ఎంతో అవసరం

నివారణ మార్గములు :
  •  కాటన్ దుస్తులు ధరించాలిముఖ్యముగా  లోదుస్తులు ఇవి మీ చర్మానికి గాలి తగిలేలా చేసి దుర్గందాన్ని దూరం చేస్తాయి.
  • ప్రతీ రోజు స్నానంలో క్రిమి సంహారిక సబ్బును ఉపయోగించాలి.
  • ఎప్పటికప్పుడు చెమట పట్టే మరియు దుర్వాసన కలిగించే శరీర భాగాలను సబ్బుతొ శుబ్రముగా కడుక్కోవాలి.
  • నేరుగా నాడీ వ్యవస్థను ప్రభావితం మరియు మరింత చెమట ఉత్పత్తికి దారి తీసే టీ,కాఫీ వంటివి ఎంత తగ్గిస్తే అంత మంచిది.
  • రక్త కణాల పై ప్రభావితం చూపి చెమటకు మరియు శరీర దుర్గందానికి కారణమయ్యే మద్యం కి దూరంగా ఉండడం ఎంతో అవసరం.
 మీ రోజు వారి మందులు అనగా  స్టెరాయిడ్ ఆస్త్మా మందులు వల్ల కూడా చెమట వ్యాపించే అవకాశం ఎక్కువ, వీటి పై శ్రద్ద చూపించి సరైన మోతాదులో తీస్కోవాలి .

చెడు వాసనతో పోరాడేందుకు సహజ నివారణలు:

  • మీ స్నానం నీటిలో ఒక టేబుల్ స్పూన్  పటికను జోడించి తీసుకుంటే, ఎంతో తాజా, దుర్వాసన రహితమైన చర్మాన్ని పొందవచ్చు.
  • మీ స్నానం తర్వాత చివరిగా ఒక టేబుల్ స్పూన్ తేనెను నీటిలో కలిపి స్నానం చేస్తే  ఇది మీ శరీర దుర్వాసనని నియంత్రిస్తుంది.
  • ఉడికించిన పుదీనా ఆకులు స్నానపు నీటిలొ కలిపి చేస్తే రోజంతా చర్మం ఎంతో తాజాగా ఉంటుంది.
  • సరైన ఆహారం తీసుకోవడం వల్ల కూడ శరీర దుర్వాసనను తగ్గించటానికి ఎంతో సహయపడుతుంది ముఖ్యముగా   మీ ఆహారం 20% మాంసకృత్తులు, 20% నూనెలు మరియు కొవ్వులు కలిగి ఉండి పండ్లు మరియు కూరగాయలు తో  తీసుకొవడం ఎంతో అవసరం.
  • మంచి  నీళ్ళు ఎక్కువగా తీసుకొవడం వలన కూడ ఎంతో అవసరం.
  • ఒక టేబుల్ స్పూన్  సొంపుగింజలను తీసుకొవడం ద్వారా మీ శరీర తాజాతనమునకు ఎంతో ఉపయోగ పడుతుంది .
  • మన జీవన శైలి మన చేతుల్లోనె ఉంటుంది,అదనపు అలసట మరియు ఒత్తిడి  మన మానసిక స్తితిని పాడుచేస్తుంది .
 దుర్వాసన అనేది  వ్యక్తిత్వానికి మంచిది కాదు, దీని నియంత్రణకు పైన సూచించిన విధముగా పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
సాధారణంగా మగవారి కన్నా ఆడవారికే చర్మం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయికొన్ని అధ్యాయనాల ప్రకారం మగవారి చర్మం ఆడవారి చర్మం కన్నా ఆలస్యంగా ముడతలు పడుతుందంట కాని, మగవారి జీవనశైలి, వారి అలవాట్లు, వారిని చర్మ సమస్యలలో ముందుకు తీసుకు వచ్చి,ఆడవారితో సమానం చేసేశాయి. అవి..


  • షేవింగ్ : సాధరణంగా మగవారు షేవింగ్ ఎక్కువగా చేసుకోవడం వల్ల చర్మ సమస్యలు అధికంగా ఉంటాయి,షేవింగ్ వల్ల చర్మం కఠినంగా అయిపొయి, చర్మంలోని తేమను తీసివేస్తుంది, అందువల్ల చర్మం పొడిగా మారి ముడతలకు దారి తీస్తుంది.  మీరు షేవింగ్ ను చల్లని నీటితో చేసుకుని,తరువాత మాయిశ్చరైజర్ఉపయోగిస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
  • ధూమపానం: ధూమపానం అనేది మగవారి యొక్క “Manliness”కి చిహ్నము లాంటిది. కాని దీని వల్లనే మగవారి వయస్సు వారి అసలు వయస్సుకన్నా ఎక్కువగా అనిపిస్తుంది,ధూమపానము మగవారి అసలు వయస్సుకి మరికొంత వయస్సు కలిపి, చర్మం ముడతలకు, పొడిబారిపోవడానికి కారణం అవుతుంది.
  • అల్కహాల్ : మగవారికి ముఖ్యమైన, ఎంతో ఉపయోగకరమైన చిట్కా ఏమిటంటే మద్యానికి దురంగా ఉండటం, ఎందుకంటే మద్యం వల్ల రక్త నాళాలు అవసరమైన దానికంటే ఎక్కువగా సాగి ఇబ్బందులు కలిగిస్తాయి.
  • వ్యాయామం: వృద్దాప్యంగా కనిపించడం అనేది చర్మం వల్లే కాదు కుంగిపోయిన కండరాలు కూడా కారణం అవుతాయి,అందుకే ప్రతీ రోజూ వ్యాయామం చేయడం వల్ల కండరాలు బలపడి చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.
  • ద్రాక్ష రసం: మగ వారి చర్మ సౌందర్యానికి ద్రాక్ష రసం ఎంతో మంచిది, ప్రతీ రోజూ ఆహారంతో పాటు ద్రాక్ష రసాన్ని తీసుకుంటే, మీ చర్మంలోని Elasticity ను పెంచి, మీ చర్మాన్ని అందంగా, యవ్వనంగా ఉంచుతుంది.
  • మసాజ్: రోజూ మీ ముఖం పై మెల్లగా మసాజ్ చేయడంవల్ల రక్త  ప్రసరణ సజావుగా సాగి చర్మాన్ని తాజాగా, యవ్వనంగా ఉంచుతుంది.
  •  రోజూ పాలతో మీ ముఖాన్ని శుబ్రం చేసుకుంటే చర్మంలోని మలినాలు అన్నీ పోయి మంచి ఫలితం కనిపిస్తుంది.
  • ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు.  ముఖ్యంగా బచ్చలికూర లేదా చిక్కుళ్ళు వంటి కూరగాయలలో చర్మం ముడతలు పడకుండా చూసుకోవచ్చు.
  • సూర్యుని కాంతి: మీ చర్మాన్ని అధికంగా సుర్యుని కాంతిలో ఉంచకండి, దాని వల్ల మీ చర్మం ముడతలు పడటానికి ఎక్కువ అవకాశం ఉంది.

     మంచి నీరు అధికంగా తీసుకోవడం వల్ల కూడా చర్మాన్ని ముడతల బారి నుంచి కాపాడుకోవచ్చు. రోజుకి కనీసం 8 గ్లాసులు, లేదా 2 లీటర్ల నీరు తీసుకుంటే చర్మ రక్షణలో ఎంతో ఉపయోగపడుతుంది.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
  • సాధారణంగా వేళకు భుజించకుండా వేళతప్పి తినడం ఒక ముఖ్య కారణం
  • అంతేకాక అరగని పదార్ధాలను, మాంసాహారలను అతిగా సేవించడం వల్ల జీర్ణక్రియ దెబ్బతిని తిన్న ఆహారం మురిగిపోయి కడుపులోని ఆ దుర్గంధమంతా పైకెగదన్ని నోటి నుండి దుర్వాసనగా వెలువడుతుంటుంది.
  •  మరికొంతమందికి భోజునం తరవాత మంచినీటితో పుక్కిలించే అలవాటు లేకపోవడంవల్ల పళ్ళసంధుల్లో ఇరుక్కున్న ఆహారపు తునకలు కొంతసేపటికి కుళ్ళిపోయి కంపుకొడుతూ నోట్లో దుర్వాసనను పుట్టిస్తుంటయ్.
తీసుకోవల్సిన జాగ్రత్తలు :
  • అలాంటి వారు తమ ఆహారం విషయంలో క్రమశిక్షణ పాటించటం ఎంతో అవసరం.
  • రోజూ ఉదయం 9 గంటలలోపు మొదటి భోజనం, రాత్రి 8 గంటలలోపు రెండవ భోజనం,మధ్యాహ్నం అల్పాహారం క్రమంతప్పకుండా సేవించడానికి అలవాటుపడాలి.
  • ఇలా ఎప్పటికప్పుడు ఆహారం తీసుకుంటుంటే వారి దంతాలు మరియూ చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండి నోటి ఆరోగ్యం ఎంతో మెరుగు పడుతుంది.
  • భోజనం చేసిన తరువాత మరచిపోకుండా పదిపన్నెండుసార్లు నోటినిండా నీళ్ళు పోసుకుని నిదానంగా బాగా పుక్కిలించి ఊసివేయాలి.
  • ఆ తరువాత ఒక్క లవంగాన్ని బుగ్గన పెట్టుకుని చప్పరిస్తుంటే దుర్వాసన హరించి నోరు సుగంధభరితమౌతుంది.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
 చికెన్: మాంసాహారంలో లీట్ మీట్ ను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది, అదనపు కొలెస్ట్రాల్ చేరదు . లీన్ మీట్ ప్రోటీనులను అందిస్తుంది. లీన్ మీట్ తినడం వల్ల పొట్ట ఫుల్ గా ఉన్నఅనుభూతిని కలిగిస్తుంది. ఎక్కువ సమయం ఆకలి కానివ్వదు.

సాల్మన్: చేపల్లో అన్ సాచురేటెడ్ (అసంతృప్త కొవ్వు )కలిగి ఉంటాయి. మరియు అత్యవసర ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును కరిగించడానికి బాగా సహాయపడుతాయి. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో సాల్మన్ మరియు మెకరేల్ వంటి ఆహారాలను మధ్యహ్నాభోజనంలో లేదా రాత్రి డిన్నర్ లో తీసుకోవడం వల్ల బరుబు తగ్గడానికి మరియు అధికంగా అధనంగా పేరుకొన్న కొవ్వును కరిగించుకోవచ్చు.

స్వీట్ పొటాటో: ఆరోగ్యదాయకం స్వీట్‌ పొటాటో.... శరీరానికి కావల్సిన పోషకపదార్థాలను అందించడంలోనే కాదు వివిధ రకాలుగా శరీరంలో చేరిన విషపదార్థాలను తొలగించడంలో చిలుగడ దుంపలకు ప్రత్యేక స్థానం ఉంది. అనేక ఖనిజ లవణాలతో పాటు దుంపలలో బరువు తగ్గించే లక్షణాలు కూడా తక్కువే

 చీజ్: లో ఫ్యాట్ కాటేజ్ చీజ్ రెగ్యులర్ గా తీసుకోవాలి . ఈ ఆహారం వల్ల మన శరీరానికి క్యాల్షియం మరియు ప్రోటీనులను అధికంగా అందివ్వొచ్చు . అయితే దీన్ని పరిమితంగా తీసుకోవాలి.

ఆపిల్స్: ప్రతిరోజూ యాపిల్‌ పళ్లు తింటే శరీరంలో పేరుకున్న కొవ్వు కణాలు తగ్గుముఖం పడతాయి. యాపిల్‌ తోలులో ఉండే పెక్టిన్‌ శరీర కణాలు కొవ్వును పీల్చుకోకుండా నియంత్రిస్తాయి.యాపిల్స్ లో ఉన్న పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ మరియు పోషకాంశాలను అటుంచితే..యాపిల్స్ లో నీటితో కూడిన పెక్టిన్ అధికంగా ఉండటం వల్ల ఇవి ఫ్యాట్ సెల్స్ ను ఘననీయంగా తగ్గిస్తుంది.

 స్ట్రాబెర్రీస్: స్ట్రాబెర్రీస్ మరియు బ్లూ బెర్రీస్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వీటిలో యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్, మినిరల్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీలో అధిక క్యాలరీలను చేర్చవు కాబట్టి, రెగ్యులర్ గా వీటిని తీసుకోవచ్చు. స్ట్రాబెర్రీ శరీర బరువును తగ్గిస్తుంది. శరీరానికి కావల్సిన శక్తిని ఇచ్చి, ఎక్కువ సేపు ఆకలికాకుండా సహాయపడుతుంది. కొవ్వును కరిస్తుంది.

 బ్రౌన్ బ్రెడ్: త్రుణధాన్యాలతో తయారుచేసిన బ్రెడ్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. శరీరంలో ఎక్కువ క్యాలరీలను తగ్గిస్తుంది . జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . ఇవి మన శరీరానికి అవసరం అయ్యే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, క్యాల్షియం, విటమిన్స్, మినిరల్స్ మరియు ఫైబర్ ను అందిస్తుంది.

 టమోటోలు: కొవ్వు త్వరగా తగ్గాలంటే పచ్చి టమాటాలు తినండి. టమాట సలాడ్ కేన్సర్ కూడా నివారిస్తుంది. కనుక కొద్ది ఆకలి వేస్తే టమాటాలు తినండి.
 మిరియాలు: మెటబాలిజం రేటును అమాంతంగా పెంచుతుంది. శరీరంలో కొవ్వు త్వరగా కరిగేందుకు సహాయపడుతాయి. ఆకలి కోరికలను కంట్రోల్ చేస్తాయి . యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.



మస్టర్డ్(ఆవాలు) : బరువు తగ్గడానికి మీరు తీసుకొనే ఆహారంలో ఆవాలను లేదా ఆవనూనెను చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆవాల్లో ఫ్యాటీ యాసిడ్స్ (ఒలియిక్, యురిసిక్ మరియు లినోలెనిక్ ఆమ్లం)లో సాచ్యురేటెడ్ ఫ్యాట్ మరియు యాంటీఆక్సిడెంట్స్ ఉండి క్యాలొరీస్ ను బర్న్ చేస్తాయి. మరియు బరువు తగ్గిస్తాయి

 పాప్ కార్న్: పాప్ కార్న్ ను మీరు బయట రెడీమేడ్ తెచ్చుకోవడం కంటే, కార్న్స్ ను తీసుకొచ్చి, ఇంట్లో తయారుచేసుకోవడం ఆరోగ్యకరం . అవుట్ సైడ్ తయారుచేసే వాటితో శరీరంలో అదనపు క్యాలరీలు చేరుతాయి.


 పుచ్చకాయ: వేసవివచ్చిందే పుచ్చకాయలు ఎక్కువగా మనకు అందుబాటులో ఉంటాయి. వీటిలో క్యాలరీలు తక్కువ మరియు యాంటీయాక్సిడెంట్స్ మరయిు విటమిన్స్ ఎక్కువ.

 బ్రొకోలీ: రీన్ వెజిటేబుల్స్ లో ఇది ఒక బెస్ట్ వెజిటేబుల్. ఉడికించిన బ్రొకోలీని ఒక కప్పు తీసుకోవడం వల్ల మంచిది. బరువు తగ్గాలనుకొనే వారు ఈ హెల్తీ గ్రీన్ వెజిటేబుల్ ను డైలీ డైట్ చేర్చుకోవాలి. 95కాలరీలున్న ఈ గ్రీన్ వెజిటేబుల్ రెగ్యులర్ గా తీసుకుంటే అతి త్వరగా బరువు తగ్గవచ్చు. అంతే కాదు ఇందులో సూపర్ క్యాన్సర్ ఫైటింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. బ్రొకోలీని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆకలిని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఇందులో ఉండే అనేక రకాల విటమిన్స్ వల్ల ఇది ఒక నేచులర్ ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్ లిస్ట్ లోకి చేరిపోయింది.

 డ్రై నట్స్ : స్నాక్స్ తినే సమయంలో లేదా ఎక్కువగా ఆకలిగా ఉన్న సమయంలో బేకరీ ఫుడ్స్ కు, స్నాక్స్ ను తినడం కంటే నట్స్(డ్రై ఫ్రూట్స్)ను తినడం వల్ల నోటికి రుచి మాత్రమే కాదు, శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. చాలా మందిలో నట్స్ తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారనో లేదా కొవ్వు అధికం అవుతుందనో చెడు అభిప్రాయం చాలా మందిలో ఉంది. అందువల్లే చాలా మంది వాల్ నట్స్ మరియు బాదాం వంటివి తినకుండా ఉంటారు. అయితే ఇది పూర్తి విరుద్దం. ఎందుకంటే నట్స్ లో డైటరీ ఫైబర్ తో పాటు కొవ్వును కరిగించే లక్షణాలు కూడా పుష్కలంగా ఉండంటం వల్ల వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల చెడు కొవ్వును నియంత్రించవచ్చు

 కిడ్నీ బీన్స్ : ప్రోటీనులు మరియు ఫైబర్ అధికంగా ఉండే కిడ్నీ బీన్స్ ను రెగ్యులర్ గా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది మరియు బరువును కూడా వేగంగా తగ్గిస్తుంది


 బ్రౌన్ రైస్ : రెగ్యులర్ గా తీసుకొనే వైట్ రైస్ కు చెక్ పెట్టి, బ్రౌన్ రైస్ తీసుకోవడానికి అలవాటు పడితే , వెంటనే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బ్రౌన్ రైస్ ఒక హోల్ గ్రెయిన్ ఫుడ్: ఇందులో విటమిన్ బి, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఐరన్ మరియు ఫైబర్లు ఫుష్కలంగా ఉన్నాయి. ఇది బౌల్ ను రెగ్యులేట్ చేస్తుంది తర్వాత, ఆకలిని నియంత్రిస్తుంది. జీవక్రియలను మెరుగుపరుస్తుంది.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
బరువు తగ్గించే ఆహర పదార్ధలు
అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గించుకోవడం చాలా కష్టం అని భావిస్తుంటారు. దానికి తోడు ఉన్న బరువును తగ్గించుకోవడానికి బదులుగా బద్దకిస్తుంటారు . బరువు తగ్గించుకోడానికి సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గించుకోవడం అంత కష్టమైనది కాదు.  అదనపు బరువుతో బాధపడే వారు, శరీరంలోని అదనపు కొవ్వును కరిగించుకోవడానికి కొన్ని ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ సహాయపడుతాయి. ఇవి క్యాలరీలను తగ్గించడం మాత్రమే కాదు, స్లిమ్ గా కూడా మార్చుతాయి. సరైన సమయంలో సరైన ఆహారంను తీసుకోవడం ద్వారా మీరు బరువు తగ్గాలనే లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. కొన్ని రోజుల పాటు ఈ ఆహారాలను తీసుకోవడంతో పాటు ఎఫెక్టివ్ వర్కౌట్స్ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను గమనించవచ్చు .  శరీరంలో చేరిన అదనపు కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చు. ఈక్రింద ఉదహరించిన ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. అయితే ఈ ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోకూడదు. బరువు తగ్గించుకొనే క్రమంలో పరిమితంగా మాత్రమే వీటిని తీసుకోవాలి. లేదంటే మీరు పొట్ట సమస్యలకు గురి అవుతారు.

  • వెల్లుల్లి: వెల్లుల్లిలో అల్లిసిన్(allicin)అనే అంశం కలిగి ఉండి యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండి శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది.
  • గ్రీన్ టీ: గ్రీన్‌ టీ గ్రీన్‌ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ మెటబాలిజమ్‌కు అనువైన పరిస్థితిని శరీరంలో కల్పిస్తాయి. అలాగే క్యాన్సర్‌ నిరోధక కారకాలు, కొవ్వు అదుపులో ఉంచే అంశాలు గ్రీన్‌ టీలో పుష్కలం.ఇది బరువు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది మరియు శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతుంది. అలాగే మరో ప్రయోజనం హార్ట్ రేటు పెంచుతుంది. మీ గుండె కొట్టుకోవడం పెంచుతుంది, దాంతో మరిన్ని క్యాలరీలను మీరు కరిగించుకోవచ్చు.
  • దాల్చిన చెక్క: మసాలాలో వాడే దాల్చిన చెక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది తీయగా, ఘాటుగా ఉంటుంది. దాల్చిన చెక్క నుండి సేకరించే నూనెలో యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలున్నాయి. అందుకే, వాటి నుండి సోకే ఏ వ్యాధులైనా సరే ఇట్టే మాయం అవుతాయి.
  • అల్లం: అల్లం శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేస్తుందని ఆరోగ్యనిపుణులు నిర్ధారించారు . మరియు ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది . ఇంకా విటమిన్స్, మినిరల్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది
  • నిమ్మరసం: భోజనం చేసిన తర్వాత నిమ్మరసం, నిమ్మజ్యూస్ తాగడం వల్ల శరీరానికి చాలా మంచిది. శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇందులోని సిట్రస్ ఆమ్లం బరువు పెరగనీయకుండా అడ్డుకుంటుంది.
  • ఉల్లిపాయ: జీవక్రియలను చురుకుగా ఉంచడంలో ఉల్లిపాయలు ప్రధాణ పాత్రను పోషిస్తాయి. అంతే కాదు, మనం వండే ఆహారాలకు మంచి రుచిని అందిస్తాయి. అందుకే పచ్చిగా కూడా సలాడ్స్ లో జోడించాలి.
  • ఓట్స్: ఓట్స్ తినడానికి మాత్రమే రుచిగా మాత్రమే కాదు ఇవి తిన్న తర్వాత కడుపు నిండుగా అనిపిస్తుంది. దాంతో అధికంగా తినాలనే కోరికను ఓట్స్ తగ్గిస్తాయి. ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉండి కొలెస్ట్రాల్ లెవల్స్ ను మరియు కొవ్వులు సమతుల్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
  •  పెరుగు: లోఫ్యాట్ పెరుగులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని కంట్రోల్ చేస్తుంది మరియు ఎముకలు మరియు దంతాలను బలోపేతం చేస్తుంది. మరియు పెరుగులో అధిక శాతంలో ప్రోటీనులు మరియు విటమిన్ డి పుష్కలంగా ఉంది.ఇది మీశరీరానికి నిరంతరం ప్రసరిస్తుంటుంది. కాబట్టి లోఫ్యాట్ పెరుగుతో పాటు, లోఫ్యాట్ మిల్క్, చీజ్ వంటి వాటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు.
  • గుడ్డు: గ్రుడ్లు జింక్, విటమిన్ B, అయోడిన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, మరియు ప్రోటీన్ కలిగి ఉన్నాయి. గుడ్లలో అధిక ప్రోటీనులు మరియ ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఉండి అతి తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. మీ శరీరాన్ని, కండర పుష్టిని పెంచుకోవడానికి ఇది చాలా సహాయపడుతుంది. అధిక కొవ్వును నియంత్రించడానికి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచుకోవడానికి గుడ్లు బాగా సహాయపడుతాయి. గుడ్డు ఆరోగ్యం, పోషక విలువలు కల బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే శరీర కొవ్వు కరిగి ఎనర్జీ వస్తుంది. గుడ్డు పొట్ట నింపుతుంది. కొవ్వును కరిగించి ఎనర్జీగా మార్చి శరీరానికిస్తుంది.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
 యాక్నె (మొటిమల వలన ఏర్పడిన మచ్చలు) పోవాలంటే రోజుకు రెండుసారు ముఖంతోపాటు యాక్నె ఉన్న ప్రదేశవుంతా పన్నీటితో కడగాలి.  తాజా నిమ్మరసాన్ని కాచిన పాలలో కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత శుభ్రం చేయాలి. ఇలా రోజుకు రెండు - మూడు సార్లు చేస్తే యాక్నె త్వరగా పోతుంది.
  • రోజుకు రెండుసార్లు గోరువెచ్చటి నీటిలో ఉప్పు కలిపి ముఖం కడగాలి.  యూకలిప్టస్‌ ఆయిల్‌తో మర్దన చేస్తే యాక్నె సమస్య తగ్గుతుంది. 
  • గుప్పెడు తులసి ఆకులు నీళ్లు కలిపి గ్రైండ్‌ చేసి ఫ్రిజ్‌లో పెట్టి చల్లబడిన తర్వాత ముఖానికి పట్టించాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే మొటిమలు, వాటి మచ్చలుపోతాయి.
  • తాజా నిమ్మరసంతో రెండు - మూడు నిమిషాల పాటు మర్దన చేయాలి. రోజూ చేస్తుంటే యాక్నె క్రమంగా తగ్గుతుంది. 
  • యాక్నె పోవడానికి అన్నింటికంటే తక్కువ ఖర్చుతో చేసే ట్రీట్‌మెంట్‌ ఇది. టేబుల్‌ సాల్ట్‌లో రెండు చుక్కల నీళ్లు కలిపి ముఖానికి పట్టించి సున్నితంగా మర్దన చేసి ఆరినతర్వాత చన్నీటితో కడగాలి. ఉప్పుకు బదులుగా చక్కెర కూడ వాడవచ్చు.
  • మెంతి ఆకులను గ్రైండ్‌ చేసి రాత్రి పడుకోబోయే ముందు ముఖానికి పట్టించి ఉదయం గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటుంటే క్రమంగా తగ్గుతుంది. యాక్నెతోపాటు బ్లాక్‌హెడ్స్‌ కూడ తగ్గుతాయి.
  • బార్లీ పొడి ఒక కప్పు, ఉప్పు నాలుగు టేబుల్‌ స్పూన్లు, పాలు ఒక కప్పు, స్ట్రాబెర్రీలు రెండు తీసుకుని అన్నింటినీ కలిపి గ్రైండ్‌ చేసి ముఖానికి యాక్నె ఉన్న చోట పట్టించి ఆరిన తర్వాత కడగాలి. ఇలా వారానికొకసారి చేస్తే పూర్తిగాతగ్గుతుంది.
  • యాక్నెను తగ్గించడంలో వెల్లుల్లిది ప్రముఖపాత్ర. రోజులో వీలయినన్ని సార్లు వెల్లుల్లిరసాన్ని పట్టించవచ్చు. చిదిమిన వెల్లుల్లితోముఖాన్ని మర్దన చేసినా కూడ మంచి ఫలితం ఉంటుంది.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
జుట్టు తెల్లపడుతుండా...
చాలా మందిలో ఇప్పుడు నెలకొని ఉన్న ప్రధాన సమస్య జుట్టు తెల్ల పడటం. ఒకటి తెల్లబడితే చాలు ఏదో కోల్పోయినట్టుగా బాధపడతారు.  మారుతున్న అహార అలవాట్లు, విశ్రాంతి, అలోచనలు ఇవన్ని మీ జుట్టుపై ప్రభావితం చేస్తాయని మీకు తెలుసా..20లు దాటకుండానే ఈ సమస్యకు అందరూ దగ్గరపడుతున్నారు. చిన్న వయసు వారే బ్యూటి స్పాల చుట్టూ తిరుగుతున్నారు. జుట్టు ఎందుకు తెల్లబడుతుందో  తెలుసుకుందామా..

వయసుతో పాటు వెంట్రుకలు తెల్లబడటం సహజమే. కాని చిన్నవయసులోనే తల నెరిసిపోవడం అసహజం. ఏ వయసులో అయినా సరే జుట్టు పండిపోవడానికి కారణం వయసుతో పాటు వర్ణకారక పదార్థాన్ని సరఫరా చేసే పొర బలహీనమై చర్యాశీలత తగ్గడమేనని వైద్యుల చెబుతున్నారు.
 వెంట్రుకలు త్వరగా నెరిసి పోవడానికి అనేక కారణాలున్నయి.

వెంట్రుకలు తెల్లబడటానికి కారణాలు:

మనం తినే ఆహారపు అలవాట్లూ, మన చేసే అశ్రద్ధ వల్ల లోపాలు, వ్యాధులు ముఖ్యంగా జీర్ణ సంబంధ వ్యాధుల తాకిడి వల్లే తల తొందరగా తెల్లబడుతుందని నిపుణులు చెబుతున్నారు.


  • వంశపారంపర్యంగా వచ్చే ఆల్బిజం వంటి వ్యాధుల వలన ఈ సమస్య రవచ్చు.


  • కొన్ని రకాల విషజ్వరాలతో బాధ పడేటప్పుడు కూడా తల నెరిసిపోవచ్చు.


  • శరీరంలోని పిట్యూటరీ గ్రంధి, థైరాయిడ్ గ్రంధి తగినంత హార్మోనులను ఉత్పత్తి చేయకపోతే చిన్నప్పుడే వెంట్రుకలు తెల్లబడతాయి.


  • ఇంకా సరైన పోషకాహారం తీసుకోనివారిలోను, వ్యాధులతో ముఖ్యంగా జీర్ణ సంబంధిత రుగ్మతలతో బాధపడేవారిలో తల తొందరగా తెల్లబడుతుంది.


  • ఇలాకాక సరైన పోషకాహారం తీసుకోనివారిలోను, వ్యాధులతో ముఖ్యంగా జీర్ణ సంబంధిత రుగ్మతలతో బాధపడేవారిలో తల తొందరగా తెల్లబడుతుంది.


జుట్టు తెల్లబడడం అంటూ ఒకసారి మొదలయిందంటే ఇక అది అలాగే ఉండిపోతుంది. వ్యాధి వల్ల జుట్టు నెరవడం జరిగితే సకాలంలో వ్యాధికి చికిత్స పొందిన సందర్భాల్లో మాత్రమే జుట్టు కొద్దిగా అయినా నల్లబడే అవకాశాలుంటాయి.

వెంట్రుకలు తెల్లబడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:


  • రోజూ తీసుకునే తిండిలో మల్టీ విటమినులు, బి కాంప్లెక్స్ విటమినులు తీసుకునే ఆహారం లో ఉండేట్టు చూసుకోవాలి.
  • తెల్లబడిన తల తిరిగి నల్లబడటానికి తగిన మందులు, చికిత్సా పద్ధతులు ప్రస్తుతానికి లేవు. మిగతా వెంట్రుకలు కూడా తెల్లబడకుండా ఉండాలంటే తినే తిండి విషయమై జాగ్రత్త తీసుకోవాలి.
  • తల బాగా నొప్పిగా ఉందనో ఉపశమనం కోసం సెలూన్లకు వెళ్ళో, స్పాలకు వెళ్ళో మర్దన పేరిట తల వెంట్రుకల కుదుళ్లను మరింత బలహీనం చేయడమే తప్ప ఏ ప్రయోజనం ఉండదు. రకరకాల తైలాలు వాడటం, ఏ చిట్కాలను ఆశ్రయించినా ఆశించినంత ఫలితం రాకపోగా మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయి.
  • ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పాలు, పాల తయారీలు, మాంసం, గ్రుడ్లు ఎక్కువగా వాడాలి. ఆకుకూరలను ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. 
ఆరోగ్యం బాగుంటే తల నెరవటం జరుగదు, జుట్టు ఊడే పరిస్తితి మీకు రాదు. అరోగ్య సమతుల్యత సాధించాలంటే పోషకాహారాన్ని చక్కగా తినాలి. ఆలోచనలకు స్వస్తి పలకండి. ఎందుకంతే ఆలోచనలెక్కువ ఉన్నవారికి అందోళన కూడా సహజంగా ఉంటుంది.కాబట్టి ఆందోళనలకు టాటా చెప్పండి. నిగనిగలాడే జుట్టును సోంతం చేసుకొండి.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
మీ  శరీరాకృతిని జీవితాంతం ఉంచుకోవడానికి పరిష్కారం కాని అద్భుతమైన మందులు కాని ఎమిలేవు. ఇక్కడ చెప్పాలనుకునే మాట ఎమిటంటే, మీరు మీ  శరీరాకృతి కోసం ఎన్నో చేస్తూ ఉంటారు, రాత్రి పూట భోజనం మానేయడం, మధ్యాహ్నం అకలితో పని చేసుకోవడం, వారం అంతా  ట్రెడ్మిల్ యంత్రం పై పరుగులు తీయడం,ఇలా ఎన్నో చేస్తూ అసలు విషయం మరచిపొతూ ఉంటారు, మనం తెలుసుకోవలసింది, ఆరోగ్యం మరియు ఫిట్నెస్ పొందాలంటే, మన మానసిక ఆరోగ్యం ఎంతో ప్రశాంతంగా ఉంచుకోవాలి.ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్ అనేవి ఎప్పటికప్పుడు మనం చేసే పనులను చుసే కోణంలో కుడా ఆదారపడి ఉంటుంది.


మెరుగైన అరోగ్యం, శరీరాక్రుతి  పొందాలంటే ఈ చిట్కాలు ఎంతో ఉపయోగకరం:

  • ఎక్కువ శాతం మంచి నీరు తీసుకోవడం ఎంతో అవసరం, రోజుకి కనీసం 6-8 oz నీరు అవసరం.
  • మీ రోజు వారి వ్యాయమంలో సరిసమాన బరువు కలిగి, ఎంతో ఉపయోగకరమైన పరికరాలతోనే  వ్యాయామం చేయడం చాల అవసరం,  రోజుకి 30 నిమిషాలు ప్రత్యేకమైన, ఎంతో  శక్తివంతమైన గుండెకు సంభందించిన వ్యాయం చేస్తే ఉపయోగపడని క్యాలరీలు కరిగి , శరీరంలోని కొవ్వు శాతం తగ్గి గుండెకు ఎంతో మంచిది.
  • సాద్యమైనంత వరకూ అధిక కొవ్వు, క్యాలరీలతో కూడిన ఆహారమును దూరంగా ఉంచండి.
  • పాల ఉత్పత్తులు , చాక్లెట్ బార్లు , వెన్న  వంటి పదార్దాలు లేని  ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం.
  • మీరు తీసుకునే భోజనంలో ఎంతో జాగ్రత్తలు తీసుకోవడం  అవసరం, సమాన్యంగా అన్నింటిలో కొవ్వు,క్యాలరీలు కలిగి ఉండటం వల్ల అవి తీసుకున్నచో మీరు లావుగా మారే ప్రమాదం ఉంది.
  • ఎక్కువగా మంచి ఆహారం తీసుకుంటే మీ శరీరాక్రుతిని కాపడుకోవచ్చు.
  • వ్యాయామం చేయడం చాలా అవసరం.



Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
zero size
కోరికలుండని మనిషుండరు. ఇక సౌందర్యోపాసన కోసం మాత్రం ఎంతకైనా మనిషి తెగిస్తాడనేది వాస్తవం. అయితే జీవితం లో ఫాషన్స్ సైక్లిక్ విధానంలో తిరుగాడుతుంటాయ్. ఆ విధానంలోనే ఒల్డ్ ఫాషన్స్ మాళ్ళీ మనకు తారసపడుతుంటాయ్. ఆ కోవాలోనికి ఈ రోజు సన్నగా నాజూకుగా ఉండే శరీరాకృతి కూడా వచ్చేసింది. అదేదో కాదు జీరో సైజ్ నడుము. ఈ నడుము గురించి ప్రస్తుతం అతివలంతా పడరాని పాట్లు పడుతున్నారు. జీరో సైజ్
విశేషాలేంటో తెలుసుకుందామా!

 సైజ్ జీరో:

  • అమ్మాయిలు అతి సన్నటి నడుముకోసం మక్కువ పెంచుకుని కృంగి కృశించిపోవడాన్నే అతిగా డైటింగ్ చేయడం, అతిగా వ్యాయామం చేయడం ద్వారా తమ శరీరాకృతిని అసాధారణ స్థితిలో కుదింపజేసుకుని స్లిమ్‌గా, నాజూకుగా, అందంగా కనిపించాలని మహిళలు పడుతున్న సరికొత్త పాటునే సైజ్ జీరో అంటున్నారు.
  • తమ శరీరం తమకే బరువుగా తయారయ్యే విపత్కర స్థితిని ఎవరూ కోరుకోరు. ప్రస్తుత కాలంలో స్త్రీపురుషులు ఇరువురూ కూడా సన్నబడటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ నాజూకుతనం కోసం ఆ ఆశ శృతి మించితే అందం కోసం పందెంలో శరీరం మోతాదుకు మించి చిక్కిపోతే సకల రోగాలకు శరీరం నిలయంగా మారుతోంది.

  • చివరకు మాతృత్వం కూడా స్త్రీకి దూరమయేలా సైజ్ జీరో ప్రభావం చూపుతోంది. ఇలా ఫిగర్ బాగుండాలని తపనతో అతి సన్నటి నడుమును కొని తెచ్చుకున్న యువతులకు బహిష్ఠు సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అంతకు మించి చిన్నవయసులోనే నెలవారీ బహిష్ఠులు ఆగిపోవడం లేదా క్రమం తప్పడం జరుగుతోందట.

  • ఇక ఇలాంటి వారికి పెళ్లంటూ జరిగితే గర్భం దాల్చడం కూడా కష్టమయిపోతోందని వైద్యుల ఉవాచ. నాజూకు శరీరం కష్టపడి సాధించుకున్న వారికి పుట్టే పిల్లలు సైతం పోషకాహారం లోపించి బరువు తక్కువతనంతో పుడుతున్నారట.
  • సన్నబడిపోవాలనే కోరిక మదిలో రగులుతుండగా అతిగా డైటింగ్ మరియు వ్యాయామం చేసే అమ్మాయిలకు అసాధారణ బహిష్టుల సమస్య వస్తోందని వైద్యులంటున్నారు. ఇంకా ప్రమాదం ఏమిటంటే ఇలాంటి నాజూకు భామల ఎముకలు ముదివయస్సులో ఉన్న వారి ఎముకల లాగా బలహీనంగా తయారవుతున్నాయి.

అందమైన శరీరాకృతి ఉండవలసిందే. ఊబకాయం మన సమీపానికి రాకుండా జాగ్రత్త పడాల్సిందే. అయితే నాజూకు పేరుతో మాతృత్వానికి సైతం దూరమయ్యే స్థితిని మహిళలు కొని తెచ్చుకోవటం మాత్రం ఇబ్బందికర విషయమే.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
బ్యూటీ టిప్స్ ఫర్ మెన్
ఈ జెనరేషన్లో మగవారికి శరీర ధారుఢ్యం పైనే కాదు వారి అందం మీద కూడా శ్రధ్ధ పెరుగుతోంది. ప్రతి వారూ తామూ.. అందంగా ఉండాలని పార్లర్లకు పరిగెడుతున్నారు. అటువంటి వారి కోసం కొన్ని బ్యూటీ టిప్స్
సాధారణంగా చాలా మంది మగవారి చర్మం ఆయిల్ చర్మం కలిగి, జిడ్డుగా ఉంటుంది. అలాగే వారి ముఖంలో ఓపెన్ రంధ్రాలు కలిగి ఉంటాయి. మగవారు ఎక్కువ బయట తిరుగుతుంటారు కాబట్టి దుమ్ము, ధూళి ముఖ రంధ్రాల్లో చేరి ముఖంలో మొటిమలు, ముడతలు ఏర్పడటానికి దారితీస్తుంది. కాబట్టి మగవారి ముఖాన్నిశుభ్రపరుచుకోవడానికి కెమికల్ ఫ్రీ బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం మంచిది. ప్రతి రోజూ ఇంటికి తిరిగి రాగానే ముఖాన్ని మంచినీళ్ళతో శుభ్ర పరచుకొని క్లెన్సింగ్ అప్లై చేయడం చాలా మంచిది.



  • అతి తక్కువ రసాయనాలు కలిగిన ఫేస్ వాష్ ఉత్పత్తులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
  • రోజుకు కనీసం మూడు సార్లైన ఫేస్ వాష్ క్రీమ్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.
  • ముఖం మరీ గరుకుగా ఉన్నప్పుడు తప్పని సరిగా పార్లర్ కి వెళ్ళి ఒకటి రెండు సార్లు వారి సలహాలను, పద్దతులను పాటించాలి.
  • సోపు ఉత్పత్తులకు సంబంధించిన లేదా డియోడరెంట్స్ కు సంబంధించిన ఉత్పత్తులను ముఖానికి వాడకూడదు.
  • షేవింగ్ చేసిన తర్వాత అలోవెరా ఫేష్ వాష్ చేసుకొంటే షేవింగ్ సమయంలో చిన్న గాట్లు ఏర్పడ్డా ఏటువంటి మార్క్స్ లేకుండా చేస్తుంది.
  • ముఖ్యంగా పురుషు చర్మం రఫ్ గా ఉంటుంది కాబట్టి అందుకోసం విటమిన్ ఇ ప్రోడక్ట్స్ ను లేదా ఆలోవరా(కలబంద)లతో తయారైనటు వంటి ఫేష్ వాష్ లతో శుభ్రం చేసుకోవాలి.
  • వ్యాజ్ లైన్ ను తరచూ పెదవులకు రాస్తుండాలి.
  • చిన్ని చిన్న జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే ముఖంలో మొటిమలు, ముడతలు, రంద్రాలు పోగొట్టి ముఖ చర్మాన్ని ఆకర్షనీయంగా ఉంచుతుంది.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
రోజ్ వాటర్ (పన్నీరు) ఉపయోగాలు
స్త్రీలు వారి అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు, ఇప్పుడు ఎన్నో రకముల, చర్మ సౌందర్యాన్ని రక్షించే వస్తువులు మార్కెట్లో లభిస్తున్నాయి. కాని తర తరాలుగా, స్త్రీ యొక్క సౌందర్య సం రక్షణలో పన్నీరు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
ఒకప్పటి కాలంలో పన్నీరుని ఎక్కువగా అన్నింటిలో ఉపయొగించేవారు, కానీ ఇప్పుడు కొన్ని కొన్ని ఉత్పత్తులలో మాత్రమే దీనిని ఉపయోగిస్తున్నారు. ఈ పన్నీరు, మరియు “రోజ్ ఆయిల్ ” మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కలుపుకుంటే మీ మృదువైన చర్మాన్ని, చర్మ వ్యాధులు నుంచి కాపడుకోవచ్చు.


మీ చర్మం పై పన్నీరు చేసే అద్భుతాలు

మన ముఖంలో ఉన్న మంటపుట్టించే చర్మం, దద్దుర్లు, ముడతలు, మొటిమలు, వీటన్నిటిపై పోరాడే తత్వం కలిగి ఉండడం వల్ల, వీటి యొక్క నివారణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.


ఈ పన్నీరు మీ చర్మంలో ఉన్న రంద్రాలని శుబ్రం చేసి, చర్మంలోని జిడ్డుని తీసేస్తుంది, అంతే కాకుండా నల్ల మచ్చలు, మొటిమలను దూరం చేసి, మీ ముఖం పై ఉన్న దుమ్ము, ధూళిని తొలగిస్తుంది .

 దీనిని మీరు మీ “ఫేష్యల్” తర్వాత ఉపయోగిస్తే మీ చర్మంలోని ఓపెన్ రంధ్రాలను మూసివేసి, కణాలని ఆరొగ్యంగా ఉంచుతుంది, అంతే కాకుండా, దద్దుర్లూ, ఎర్రబడిన ప్రదేశాన్ని తగ్గించి, మంచి ప్రభావాన్ని  చూపిస్తుంది.

 ఈ పన్నీరులోని సుగంధ పరిమళాలు మీ యొక్క మనసిక స్థితిని పెంచి, భావోద్వేగంతో కూడిన ఆలోచనలని తగ్గించి ప్రశాంతత ఇస్తాయి. ఇది మీకు నిద్ర సరిగా పట్టడానికి మరియు లేచిన వెంటనే మనసంతా ఎంతో ప్రశాంతంగా, ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

చాల సులువైన, మార్గం ఏమిటంటే మీరు రాత్రి పూట నిదురించే ముందు ఇది రాసుకుని పడుకుంటే, మీ ముఖం లోని మలినాలను శుద్ది చేసి, మరుసటి రోజు ఎంతో కాంతివంతంగా మెరిసే చర్మాన్ని ఇస్తుంది.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
రమజాన్‌ నెల ఖుర్‌ ఆన్‌ అవతరించిన నెల. అందుకే విశ్వసించినవారు ఈ నెలను పూర్తిగా ఖుర్‌ ఆన్‌కే అంకితం చేస్తారు. ఖుర్‌ ఆన్‌ని పఠించడానికి, దాన్ని ఆకళింపు చేసుకొనడానికి తద్వారా జీవితాన్ని సౌభాగ్యవంతం, పునీతం చేసుకోవడానికి, ఆత్మల్ని ప్రక్షాళనం చేసుకోవడానికి యత్నిస్తారు. ఇలా ఖుర్‌ ఆన్‌ నేర్పే కరుణానుగ్రహాలను సొంతం చేసుకుంటారు. 

ఈ నెలలోనే జకాత్‌ని చెల్లించి తమ సంపదలో అగత్యపరులకు, ఉపేక్షితులకు దైవం నిర్ణయించిన వారి వాటాను అందజేస్తారు. అలా సంపదను పరిశుద్థపరచుకుంటారు. సుసంపన్నం చేసుకుంటారు. అందుకే ప్రవక్త మహనీయులు ఈ నెలను సహన సంయమనాల నెల, సానుభూతి నెల అన్నారు. నిజం చెప్పాలంటే ఈ రమజాన్‌ నెల ఖుర్‌ ఆన్‌ నెల! 

 అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్‌ పేరుతో ప్రారంభిస్తున్నాను : 1-3 

అల్లాహ్‌ మాత్రమే స్తుతింప దగినవాడు. ఆయన సకల లోకాలకు ప్రభువు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రతిఫలదినానికి స్వామి. 4-7 మేము నిన్నే ఆరాధిస్తాము. సహాయం కొరకు నిన్నే అర్థిస్తాము. మాకు రుజుమార్గం చూపించు- నీవు అనుగ్రహించినవారూ, నీ ఆగ్రహానికి గురికానివారూ, మార్గభ్రష్టులు కానివారూ అనుసరించిన మార్గము. 

1. అల్లాహ్‌ ఈ ‘ఫాతిహ’ సూరాను తన దాసులకు నేర్పాడు. వారు దానిని ఒక విన్నపం రూపంలో తమ ప్రభువు సాన్నిధ్యంలో సమర్పించుకునేందుకు. 

2. రబ్‌ (ప్రభువు)అనే పదం అరబ్బీ భాషలో మూడు అర్థా లలో వాడబడుతుంది. (1) స్వామి, యజమాని (2)పెంచేవాడు, పోషించేవాడూ, కాపాడేవాడు, కనిపెట్టి వుండేవాడూనూ. (3) చక్రవర్తి, పరిపాలకుడు, యుక్తిపరుడు, నిర్వాహకుడు, అల్లాహ్‌ ఈ అన్ని అర్థాలలో నూ సృష్టికి ప్రభువు. 

3. ఇబాదత్‌ అనే పదం కూడా అరబ్బీ భాషలో మూడు అర్థాలలో ఉపయోగించబడుతుంది. (1) ఆరాధన, ఉపాసన (2) విధేయత, ఆజ్ఞాపాలన (3)దాస్యం, బాని సత్వం 

4. దాసుని ఈ ప్రార్థనకు ఖురాను యావత్తూ జవాబు. దాసుడు తన ప్రభువును మార్గదర్శకత్వం కోసం ప్రార్థిస్తాడు. ప్రభువు దానికి సమాధానంగా ఈ ఖురానును అతనికి ప్రసాదిస్తాడు. అల్‌ ఫాతిహ ఆరువేల ఆరువందల పైచిలుకు వచనాలు, నూటపద్నాలుగు అధ్యాయాలు, దాదాపు వెయ్యి పుటల దివ్య ఖుర్‌ ఆనైఉ గ్రంథం విషయవైవిధ్యం రీత్యా అపురూపమయినది. అపారమైన సాహితీ సౌందర్యలు ఆ గ్రంథానికే ప్రత్యేకం. అనన్యమైన శైలి విషయ విస్తృతికి అమరిపోయిన ముత్యాలహారం, మానవజీవిత పుష్పం ఎంత వికసితమయిందో అంతే విశాలమయింది.
దివ్య ఖుర్‌ ఆన్ చర్చనీయాంశాల ఫలకం, గగన భువనాలలా సాగర సమీరంలా పరిమితులు, పరిధులు, ఎల్లలు, అవధులులేవు. అందులో ప్రస్తావించిన విషయాల జాబితా అనంతం, అనన్యసామాన్యం. తరగని నిధి అన్నింటినీ సమాధానపరుస్తుంది ఖుర్‌ ఆన్. అన్నింటికీ పరిష్కారాలు చూపెడుతుంది. అందుకే ప్రపంచంలో వెయ్యిన్నర సంవత్సరాల నుండి ప్రతిదినం, ప్రతిచోట, ప్రతి ముస్లిముల ఇంట, ప్రతి మసీద్‌లో, ప్రతి నమాజ్ లో అనుక్షణం ఎక్కడో తమ జీవితాన్ని ధన్యం చేసుకుంటూనే ఉంటారు. 
ఆ దివ్యగ్రంథాన్ని ఎన్నిసార్లు చదివినా, ఎన్నెన్ని విధాలుగా ఆకళింపు చేసుకున్నా, ఎన్నెన్ని కోణాలలో పరిశోధించినా, ఎంతకాలం తరచి తరచి చూసినా దాని శుభాలు తరగవు. అందుకే అది శుభాల సరోవరం. విశ్వాసాంశాలు అందులో ప్రతిపాదింన విశ్వాసాల్లో ఒక్కొక్క అంశమూ, అది అవతరించిన రోజుల్లో ఎలా సత్యమని దేదీప్యమానంగా రుజువయిందో, ఎలా నిత్య తను ఘంటపథంగా ప్రకటించిందో అలాగే నేటికీ, ఈ అత్యాధునిక కాలంలోనూ నిత్యనూతనంగా పచ్చపచ్చగా, రెపరెపలాడుతూ ఉంటుంది దాని నమ్మకాల బావుటా. అంతేకాదు, కాలం ముందుకు సాగినకొద్దీ ఆ విశ్వాసాల సత్యత, నిత్యత మరీ మరీ రూఢీ అవుతూ ఉంటుంది. 

దాని విశ్వాస ప్రాతిపది కలు ముఖ్యమయినవి మూడు. ఒకటి దేవుని ఏకత్వం, అజ్ఞానపు తెరలు తొలిగి మనిషి జ్ఞానపరిథి విస్తృతమయిన ప్రతిసారీ మూఢనమ్మకాల ఊబిలో నుంచి బయటపడి క్రమేణ దేవుని ఏకత్వపు స్వేచ్ఛాయుత రాచబాట వైపునకు హేతుబద్ధంగా అడుగుముందుకు వేస్తున్నాడు మనిషి. మానవులంతా ఒకేజాతి, మానవజాతి అయినప్పుడు, మానవునికీ ఈ సృష్టియావత్తుకూ కర్త ఒక్కడే అయినప్పుడు, విశ్వవ్యవస్థ పరిపాలనను కూడా ఒకేశక్తి నిర్వహిస్తున్నప్పుడు, మానవుని ఆరాధనకు, పూజకు, భక్తికీ అన్యులు ఎలా అర్హులవుతారు? ఈ సత్యాన్ని నేడు గ్రహించగలిగాడు ఆధునిక మనిషి, దేవుడు ఒక్కడే అన్న ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చాడు మనిషి. అలాగే రెండవ ప్రధాన విశ్వాసాంశం దైవ దౌత్యం. అదొక పరిమళం. వెలుగు, ఎంత వాడు కున్నా తరగని గని, ఎల్లలు లేని పరిధి. ఈ గజిబిజి ప్రాపంచిక జీవన వ్యవస్థలో మానవునికి సరయిన అనుసరణీయమయిన, ఆనందకరమైన, ఆహ్లాదకర మయిన మార్గమేదో, జీవితపు అనేక చిక్కుముడుల్ని విడదీసే మూలమంత్రమేదో, అసంఖ్యాక సమస్యల కీకారణ్యం నుండి బయటపడే పరిష్కార మేమిటో ఎవరు చెప్పాలి? మానవుని సకల ప్రశ్న లకు సహేతుక సమాధానం ఒక్కటే - అదే సృష్టికర్త, ప్రభువు పాలనాధికారం గల స్వామి దైవం మాత్రమే ఆ దారి చూపగలడు. నిజం! ఆ దేవుడే తన మార్గదర్శక గ్రంథాలను అందజేయవలసిందిగా సచ్ఛీలురయిన తన దాసులను నియమించారు. వారే తన ఆదేశాలను పాలించే ఆదర్శమూర్తులుగా ప్రకటించారు. అటువంటి మార్గబోధనల్లో కడపటి గ్రంథమే దివ్య ఖుర్‌ ఆన్. అటువంటి జ్ఞానబోధకుల్లో అంతిమ దైవసందేశహరుడే మహమ్మద్‌(సల్లల్లాహు అలైహి వసల్లం). ఖుర్‌ ఆనైఉ ప్రతిపాదించే మూడవ విశ్వాసం పరలోక జీవితం. ప్రపంచంలో జన్మింన ఒక్కొక్క మానవుడు నశిస్తూనే ఉన్నాడు. ఏ ఒక్కడూ మిగలటం లేదు. మానవలోకమూ నశిస్తుంది. ఇహలోకం, ఇహలోక జీవితం, ఈ విశ్వ వ్యవస్థ అంతానశ్వరమయినదే. ఒకనాడు అంతా అంతమయిపోవలసిందే. అది మానవునికి అనుభవైక సత్యం.అందుకే పుట్టుట, గిట్టుట కొరకే అన్న నానుడి పుట్టింది. అయితే ఈ జీవితం ఏమిటీ? ఈ మరణం ఏమిటీ? ఈ జీవితం అంతమయిన తరువాత జరిగే దేమిటీ? కేవలం వినోదం కొరకేనా ఈ జీవన కళ తొణికిసలాడేది? అనే ప్రశ్నలు మటుకు మిగులుతాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే ఖుర్‌ ఆన్. పరలోక జీవితం మరణంతో ముగియదు. ఒక దశ దాటి మరో దశలోకి ప్రవేశద్వారమే తప్ప మరణం మరేమి కాదు. అక్కడ ఆది నుండి అంతం వరకు ప్రభవించిన మానవులంతా ఈ ప్రపంచం దాటి మరో ప్రపంచంలోకి ప్రవేశిస్తారు. అక్కడి ప్రమా ణాలు వేరు. అక్కడి తులమానాలు వేరు. అక్కడ సత్యమే బరువు. సత్యానికే విలువ. సత్యానికి తప్ప అసత్యానికి శరణు గోరినవారు పరలోకంలో పరాజితులవుతారు. ఈ జీవితం కేవలం ఓ పరీక్షా వ్యవస్థ ఇక్కడ ప్రతి మనిషీ అనుక్షణం పరీక్షింపబడుతున్నాడు. పరీక్ష తరువాత ఫలితాల దశయే ప్రళయ ఛట్టం. పరీక్షలో నెగ్గాలంటే మానవులు, తమ స్వామి పంపిన మార్గదర్శకత్వాన్ని స్వీకరించాలి. దాన్నే అనుసరించాలి. అలా అనుసరింనవారు పరీక్షలో సఫలీకృతులవుతారు. అనంత సౌభాగ్యాలకునోచుకుంటారు. దైవప్రబోధాలను కాదన్న వారు నిష్ఫలురవుతారు. శాశ్వతంగా నష్టానికి లోనవుతారు. ముగియని నరకయాతనకూ గురవుతా రు. ఇదీ ఆ మూడు ప్రధాన విశ్వాసాల సారాంశం. దైవగ్రంథం- దైవధర్మం ఖుర్‌ ఆన్ బోధనలకు భూమిక ఇది. ఖుర్‌ ఆన్ మానవాళికి ఇచ్చే ప్రముఖ సందేశం కూడా ఇదే. దీని ఆధారంగా ఒక సంపూర్ణ జీవన వ్యవస్థను నిర్మిస్తుంది ఖుర్‌ ఆన్. అది మానవ జీవితాన్ని ఖండికలు ఖండికలుగా విభజించి వేర్వేరు మార్గాలను, వేర్వేరు విధానాలను ప్రతిపాదించదు. జీవితం ఒక సంపూర్ణమయిన సమగ్రమయిన ఏకాంకమన్న యధార్థాన్ని ఆధారంగా సముతమయిన సహేతుకమైన, సమంజసమైన ఒకే జీవన వ్యవస్థను ప్రతిపాదిస్తుంది. ప్రాపంక వ్యవహారాలు వేరు, పరమార్థిక వ్యవహారాలు వేరని సిద్ధాంతీకరించే వారితో ఏకీభవించదు. ప్రపంచం ద్వారానే పరమార్థాన్ని సాధించాలని సూచిస్తుంది. భౌతికతత్వానికి ఆధ్యాత్మికతత్వంతో తాదాత్మ్యం చేకూరే సమక్య జీవన తత్వాన్ని రూపొందిస్తుంది. ఇదే ఖుర్‌ ఆన్ ప్రబోధాల సారం. ఖుర్‌ ఆన్ రచించిన గ్రంథం కాదు. దాన్ని మానవాళికి అందజేసిన ప్రవక్త (స) రచింనదీ కాదు. తానే దాన్ని రచింనట్లు ఆయన కూడా ఎన్నడూ చెప్పలేదు. ఇది దైవగ్రంథం. అందువల్ల ఈ గ్రంథం ప్రతిపాదించే ధర్మం మానవకల్పిత ధర్మం కాదు. ఆ ధర్మం కూడా దైవం రూపొందించిన ధర్మమే. ఇది దైవగ్రంథమని, దీని ధర్మం దైవ ధర్మమని ఖుర్‌ ఆన్ స్వయంగానే ప్రకటించుకుంది. వచనాలు ఇది (ఖుర్‌ ఆన్) దైవగ్రంథం, ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. 

భయభక్తులు గలవారికి మార్గదర్శకం. (ఆల్ బకఱ్ :2) ఇది (ఖుర్‌ ఆన్) అసాంతం మానవులకు మార్గదర్శకం, అందులో విస్పష్టమైన బోధనలున్నాయి, అవి రుజుమార్గాన్ని చూపుతాయి.
 సత్యాసత్యాల వ్యత్యాసాన్ని విడమర్చి తెలుపుతాయి (ఆల్ బకఱ్ : 185) ఇది (ఖుర్‌ ఆనైఉ) జనులకు ఒక స్పష్టమైన, విశదమయిన హెచ్చరిక, దైవానికి భయపడేవారికి మార్గనిర్దేశన హితబోధన (అల్ ఇమ్రాణ్ : 138) మేమే ఈ (ఖుర్‌ అన్) గ్రంథాన్ని అవతరింపచేశాము. మేమే దీన్ని భద్రపరిచేవారము కూడా (ఆల్ హిరజ్ : 9) ప్రవక్త స్వయంగా ఈ గ్రంథం రచించాడని ఈ జనం అంటున్నారా? వారికి చెప్పు ‘‘సరే నిజమ యితే దీనిలాగే రచింన పది సూరాలు మీరు కూర్చి తీసుకురండి అల్లాహ్‌ తప్ప ఎవరెవరు (మీ ఆరాధ్యులుగా) ఉన్నారో (వారిని ఆరాధ్యులని భావించడంలో) మీరు సత్యవంతులే అయితే, వారిని సహాయానికి పిలుచుకోగలిగితే పిలుచుకోండి’’ (హూద్‌ : 13) మా దాసునికి మేము అవతరింపజేసిన ఈ గ్రంథం మేము పంపినదో కాదో అన్న సందేహం మీకు ఉన్నట్లయితే ఇలాంటి సూరా ఒక్కటి అయిన రచించి తీసుకురండి, సహాయం కొరకు మీ తోటివారందరినీ పిలిపించుకోవచ్చు. 

ఒక్క అల్లాహ్‌ తప్ప మరెవరి సహాయమయినా పొందవచ్చు. మీరు నిజాయితీపరులయితే ఇది చేసి చూపండి (బకఱ్ : 23) ప్రవక్త స్వయంగా దీనిని రచించుకున్నాడని వీరు అంటున్నారా? చెప్పు ‘‘ఈ ఆరోపణలో మీరు నిజాపయితీ పరులే అయితే ఒక్క సూరా ఇటు వంటిది రచించి తీసుకురండి, ఒక్క దైవాన్ని వదలి ఎవరెవరిని పిలుచుకోగలుగుతారో తోడుగా పిలుచుకోండి. (యూనుస్‌ : 38).
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
11-07-2015  సాయంత్రం సరిగ్గా 5 గంటలకు భారత జనాభా సంఖ్య 127, 42, 39, 769కి చేరింది. ప్రపంచ జనాభా
దినోత్సవం సందర్భంగా జాతీయ జనాభా కమీషన్, అమెరికా గణాంకాల సంస్థల సంయుక్త సమాచారం ఆధారంగా ‘జాతీయ జనాభా స్థిరీకరణ నిధి’ ఈ వివరాలను వెల్లడించింది. ఏటా భారత్లో 16 శాతం వృద్ధి నమోదవుతున్న కారణంగా 2015 సంవత్సరానికి చైనాను వెనక్కినెట్టి జనాభా పరంగా తొలి స్థానంలో నిలుస్తుందని తెలిపింది. కాగా, ఇప్పటికి ప్రపంచ జనాభాలో 17.25 శాతం జనాభా భారత్లోనే నివసిస్తున్నారు. కాగా, ప్రపంచ జనాభా సంఖ్యలో ఐదో స్థానంలో ఉన్న బ్రెజిల్ కంటే మన దేశంలోని ఉత్తరప్రదేశ్ జనాభా సంఖ్యే ఎక్కువ కావడం