ఎత్తైన ప్రహారీతోవిశాలమైన ఆవరణలో విలసిల్లుతున్న కదిరి నరసింహాలయం 13 వ శతాబ్దం నుండి దశలవారీగా అభివృద్ది చెందిందని శాసనాల ద్వార తెలుస్తుంది. ఆలయానికి నాలుగు వైపుల గోపురాలు కలిగి వుండి ప్రధాన ఆలయంలో గర్భగుడిఅంతరాలయంప్రదిక్షిణా పథంముఖ మంటపంఅర్థ మంటపంరంగమంటపం ఉన్నాయి. రంగ మండపంలో ఉన్న నాలుగు స్థంభాలపై ఉన్న శిల్ప కళా రీతులు అత్యంత సుందరం గా ఉంటాయి. ఇక్కడున్న కోనేరును భృగుతీర్థం అంటారు. ఇక్కడి స్వామివారు అమ్మతల్లితాయారుప్రహ్లాదులతో కలిసి దర్శనిమిస్తారు.
కాటమరాయడా..కదిరి నరసింహుడా...బేట్రాయి సామి దేవుడా..నన్నేలినోడా...బేట్రాయి సామి దేవుడా...
ఇలా భక్తుల చే కొనియాడబడే ఈ నరసింహ స్వామి విశిష్టత చాల గొప్పది.
వేదారణ్యమైన ఈ ప్రాంతంలో ఖదిర చెట్లు ఎక్కువగా ఉన్నందున దీనికి కదిరి అని పేరు వచ్చింది. ఖదిరి చెట్టు అనగా చండ్ర చెట్టు. ఈ అలయంలో రంగ మండపం పై వేసిన రంగుల బొమ్మలు శతాబ్దాల నాటివి. అందుచేత కొంత వెలిసినట్లున్నాఇప్పటికీ బాగున్నాయి. ఈ ఆలయం ముందున్న పెద్ద రాతి ధ్వజస్థంభం నిలబెట్టిన విధానం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ధ్వజ స్థంభం పునాది లో నుండి కాకుండా ఒక బండ పైనే అలా నిలబెట్టి ఉన్నది.

ఉత్సవాలు

ప్రతి సంవత్సరం సంక్రాంతి నాడు స్వామి వారి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో వచ్చే పశువుల పండుగ రోజున శ్రీదేవిభూదేవి లతో కలిసి వసంత వల్లభుడు కదిరి కొండకు పారువేట కు వస్తాడని భక్తుల విశ్వాసం. పారువేట అనంతరం స్వామి వారిని ఊరేగింపుగా ఆలయంలోనికి తీసుక వస్తారు. దీన్నే రథోత్సవం అంటారు. ఈ రథోత్సవానికి చాల ప్రాముఖ్యత ఉన్నది. ఈ రథం 120 టన్నుల బరువుండి ఆరు చక్రాలతో సుమారు నలబై ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ రధోత్సవం సమయంలో భక్తులు రథంపై దవణంపండ్లుముఖ్యంగా మిరియాలు చల్లుతారు. క్రింద పడిన వీటిని ప్రసాదంగా భావించి ఏరుకొని తింటే సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మికం. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు పాల్గుణ బహుళ పౌర్ణమిని కదిరి పున్నమిగా జరుపుతారు. ఈ రోజు భక్తులు ఉపవాసముంటారు. ఏటా ఈ అలయంలో నృసింహ జయంతినివైశాఖ శుద్ద చతుర్దశిమల్లెపూల తిరుణాళ్లను వైశాఖ శుద్ద పౌర్ణమిచింతపూల తిరుణాళ్లనుఅషాడపౌర్ణమిఉట్ల తిరుణాళ్లనుశ్రావణ బహుళ నవమిదసరా వేడుకల్నివైకుంఠ ఏకాదశి రోజుల్లో జరుపుతారు.

ఆలయ విశిష్టత

ఎక్కడా లేని ఈ కదిరి నరసింహుని ఆలయ ప్రత్యేకత ఏమంటే
ఉత్సవాల సమయంలో ముస్లింలు కూడ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ స్వామి ని కొలుస్తుంటారు. తమిళనాడుకర్ణాటక రాష్ట్రాల నుండి  కూడ భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి ఇంకో విశేష మేమంటేకదిరి పట్టణానికి సుమారు ఇరవై ఐదు కిలో మీటర్ల దూరంలో తిమ్మమ్మ మర్రి మాను ఉన్నది. ఇది ఏడున్నర ఎకరాల స్థలంలో విస్తరించి1100 ఊడలతో ఉన్నది. దీని వయస్సు సుమారు ఆరు వందల సంవత్సరాలు ఉంటుందని నమ్మకం. ఇది గిన్నిసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడ స్థానం సంపాదించుకుంది. కదిరికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో కటారు పల్లె లో యోగి వేమన సమాధి కూడ వుంది. ఇది కూడ పర్యాటకులను ఆకర్షిస్తున్నది.



Next
కొత్త పోస్ట్
Previous
This is the last post.
Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: