''ధనహీనమైనదైనా స్వధర్మమే ఉత్తమం'' – గీతాచార్యుడువ్యక్తి తన గమ్యాన్ని అయితే భయం వల్ల లేదా లోభం వల్ల మార్చు కుంటాడు. ఈ రెంటికీ లొంగకుండా ముందుకు సాగినవాడే విజయాన్ని పొందగలడు. ఏదో ఒక కారణంవల్ల ప్రతి క్షణం గమ్యాన్ని మార్చేవాడు ఢిల్లీకి వెళదామని రైలు ఎక్కి మళ్ళీ రెండు స్టేషన్ల తరువాత దిగి బొంబాయి రైలు ఎక్కినట్టుగా ఉంటుంది. ఇలా రైళ్ళు మార్చడంలోనే జీవితమంతా గడచిపోయి అసలు ఏ గమ్యమూ చేరలేకపోవచ్చు.
శ్రీమతి రుక్మిణీ అరుండెల్ నృత్య, సంగీతాదికళలలో వైదుష్యమున్న ఒక గొప్ప కళాకారిణి. దేశ కళా సంస్క ృతిక పునర్జాగరణ కొరకు 'తిరువన్ మియార్లో దాదాపు వంద ఎకరాల స్థలంతీసుకొని అందులో కళాక్షేత్రం అనే ఒక సంస్థను స్థాపించింది. అక్కడ ఇప్పటికీ యోగ్యులైన గురువుల ద్వారా విద్యార్ధీవిద్యార్ధినులకు నృత్య, సంగీతాది (గాత్ర, వాద్య) చిత్రకళలలో శిక్షణ ఇవ్వబడుతున్నది. 1977లో ఆవిడ తన కళా సమాజంతోబాటు భారతీయ నృత్య ప్రదర్శనలివ్వడానికి హాలెండ్ వెళ్ళింది. ఒకరోజు ఉదయం ఆవిడ విడిదిచేసిన హోటల్ గదిలో ఫోన్ గంట మ్రోగింది. ఆపరేటర్ ఆవిడతో భారత ప్రధానమంత్రి మొరాజ్జీ దేశాయ్ ఆవిడతో మాట్లాడబోతున్నట్లుగా చెప్పింది. మొరార్జీదేశాయ్ ఆవిడతో భారత రాష్ట్రపతి పదవి స్వీకరించమని కోరాడు. ఒక్క క్షణం ఆవిడను స్తబ్ధత ఆక్రమించుకున్నది. కాసేపు ఆవిడ ఏమీ
మాట్లాడలేకపోయింది. ''ఏమిటీ రాష్ట్రపతి పదవా''? అనిమాత్రం అన గలిగింది మళ్ళీ తమాయించుకొని ''నేను ఆ పదవి గురించి ఏమీ ఎరుగనే?'' అన్నది. మొరార్జీదేశాయ్ ఆవిడకు ధైర్యం చెబుతూ ''ఫరవాలేదు మీరే తెలుసుకోగలరు. ప్రస్తుతం మీరు మీ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని భారతదేశానికి తిరిగిరండి'' అన్నాడు.
''మీరు చెబుతున్నారు కనుక అలాగే రావడానికి ప్రయత్నిస్తాను'' అన్నది. శ్రీమతి అరుండెల్ అదురుతున్న గుండెలను చిక్కబట్టుకొని. ఆ రాత్రి ఆవిడకు నిద్రపట్టలేదు. ''నేను అంత శ్రేష్టమైన పదవికి అర్హురాలినేనా? నేనీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలనా? ఒకవేళ నేను ఆ పనిని సరిగ్గా చేయగలిగినా మరి నా కళాక్షేత్రం ఏమవుతుంది?'' ఈ విధంగా ఆలోచిస్తూ రాత్రంతా గడిపింది. తెల్లవారుజామున ఒక చిన్న కునుకు తీసిలేచింది. ఆవిడ మనస్సు ఇప్పుడు స్థిరమైంది.తన జీవిత గమ్యం కళేనని నిర్ణయించుకుంది. ఉదయం ఫోన్లో మొరార్జీ దేశాయ్తో వినమ్రంగా ''నేను రాష్ట్రపతి పదవిని స్వీకరించి నిర్వహించడానికి అసమర్ధురాలను'' అని తన నిర్ణయం చెప్పివేసింది. మొరార్జీదేశాయ్ ఆవిడకు ఎంతో నచ్చచెప్పచూశాడు.రాజకీయాలకు దూరంగా కళకు సమర్పితమై విశ్వవిఖ్యాతిగాంచిన ఆవిడను అందరూ రాష్ట్రపతిగా స్వీకరిస్తారని తాను కూడా ఆ పదవికి న్యాయం చేకూర్చగలదని చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పినా ఆవిడ మాత్రం స్వీకరించలేదు. చివరికి ఓటమి నొప్పుకున్న మొరార్జీదేశాయ్ ''మీకు నిజంగా నా ప్రస్తావన స్వీకారం కాకపోతే అదే విషయం స్పష్టంగా తెలియజేస్తూ ఒక టెలిగ్రామ్ ఇవ్వవలసింది'' అన్నాడు. శ్రీమతి అరండేల్ వెంటనే టెలిగ్రామ్ పంపింది. రెండవ రోజు దేశ విదేశాలలోని అసంఖ్యాకమైన పత్రికలు కళాక్షేత్రంపై ఆవిడకు గల సమర్పణను, ఇంత గొప్ప పదవిని కాదనగలిగిన ఆవిడ త్యాగబుద్ధిని కొనియాడుతూ వ్రాశాయి. ఆ తరువాత ఆవిడ కళకే పూర్తిగా సమర్పితమైంది
సాధారణంగా గొప్పవాళ్ళు ఆ గొప్పతనాన్ని కేవలం తమ తెలివి తేటలతోనే కాకుండా నిరంతర పరిశ్రమవల్ల పొందుతారు. - బ్రూస్ బార్టన్
Post A Comment:
0 comments: