కొత్త సత్యాలను ప్రతిపాదించడం కష్టంకాదు. పాత దురలవాట్లను తొలగించడమే దుర్లభం. మనుషులు స్వాభావికంగా కొత్తవాటికి స్వాగతం చెబుతారు. కానీ పాతవాటిని వదులుకోరు.''
విజ్ఞానం :
ఇది విజ్ఞాన విస్ఫోటనయుగం. సైన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరం ఇది. ఒకప్పుడు గుఱ్ఱంమీద గంటకు 25 కి.మీ వేగంతో ప్రయాణించిన మానవుడు, ఇప్పుడు 30 వేల కి.మీ పైబడిన వేగంతో రోదసిలో ఉపగ్రహాలను తిప్పుతున్నాడు. వార్తను ఒక ప్రాంతం నుండివేరొక ప్రాంతానికి చేర్చడానికి కొన్ని నెలలు పట్టేరోజులు వెళ్ళిపోయి, భూమిమీద ఎక్కడో వేలమైళ్ళ దూరంలో జరిగే విషయాన్ని సెటలైట్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు చూసే రోజులు వచ్చాయి
ఘర్షణ :
వృద్ధులకు ఈ ప్రంచంలో విలువలన్నీ అడుగంటిపోతూ కనిపిస్తున్నాయి; మధ్యవయస్కులు కొత్తపాతల మధ్య ఊగిస లాడుతున్నారు.యువతరానికి తక్కిన వారు ఛాదస్తులు, అడవి మనుషులుగా కనిపిస్తున్నారు.
తలోదారి :
వృద్ధులు, మార్పులను ప్రతిఘటిస్తారు, యువకులు కొత్త మార్పుల కొరకు పరితపిస్తారు. వృద్ధులు ఉమ్మడి కుంటుంబ వ్యవస్థ శిధిలమైపోతోందని పరితపి స్తుంటే, యువకులు ఒంటరి తనం లభించడంలేదని బాధపడతారు. ఈ మార్పును జీర్ణించుకొని యువతరానికి దగ్గరవ్వాలో లేక సనాతన వ్యవస్థకు పట్టంగట్టి పై తరాన్ని గౌరవించాలో తెలియక నలిగిపోతారు మధ్య వయస్కులు.
సమన్వయం :
పల్లెలలో బ్రతికినవారు మహానగరాలలో ఉక్కిరిబిక్కిరవడం సహజం.వారి నర్ధం చేసుకొని మెలగడానికి యువతరం ప్రయత్నించాలి. తాము మారకపోయినా ఫరవాలేదు గాని యువతరానికి ప్రతిక్షణం అడ్డుపడుతూ, తాము బ్రతికినట్లే వారిని బ్రతకమనకుండా ఉండాలి పెద్దతరం.
మార్పులను అవసరాన్ని గుర్తించి,వాటి స్వభావాన్ని అర్ధం చేసుకొని, వాళ్ళ ఆలోచనలను, ప్రవర్తననూ ఆయా పరిస్థితులకు అనుగుణంగా సమన్వయం చేసుకోగలగాలి మధ్యతరం.
వ్యాపార సరళి :
కేవలం నమ్మినంత మాత్రాన ఇంతకు మునుపు చేయని పనులు కొత్తగా చేయడం కష్టమంటారు గానుగెద్దులాంటి మనుషులు. మారదలచుకున్నవాడు ముందు పాత అలవాట్లను వదులుకోవడానికి సిద్ధపడాలి. మనమంతా కొత్త జీవన సూత్రాలను వెతుకుతూ బయలుదేరుతామే గాని తెలిసినవాటిని ఆచరించడానికి ప్రయత్నించం. ఈ బలహీనతను ఆధారంగా చేసుకునే పాతసబ్బులు, పేస్టులకు కొత్తది (శ్రీలిగీ)అని వ్రాసి అమ్ముకుంటారు వ్యాపారవేత్తలు.
ఎలా నమ్మడం :
ఒకసారి ఒకవ్యక్తి కాలుజారి ఒక లోయలో పడిపోతూ చేతికి దొరికిన ఒక ఊడను పట్టుకున్నాడు. క్రిందికి చూస్తే అగాధం పైకి చూస్తే ఆకాశం. ఏం చేయాలో దిక్కుతోచకుండా ఉన్న అతడు ''ఎవరన్నా నన్ను రక్షించేవారున్నారా'' అన్నాడు. ఇంతలో ''నా పైన నీకు విశ్వాసం ఉంటే పట్టుకున్న ఆ ఊడను విడిచిపెట్టు'' అనే గంభీరమైన వాణి ఆ లోయలో ప్రతిధ్వనించింది. వెంటనే ఆ వ్యక్తి ''ఇంకెవరన్నా ఉన్నారా'' అన్నాడు.
సాగిపోండి :
అందుకే భూతకాలపు విలువలనే విశ్వసించాలా! లేక వర్తమానపు విలువపై ఆధారపడాలా? లేక కొత్త పాతలలో ఏది ఉత్తమం అనిగానీ ఆలోచించక ఎదుటి తరంస్థానంలో నిలిచి వారి స్థితిగతులను అర్ధం చేసుకొని ఏది అవసరమో, ఏది అనవసరమో గ్రహించి, అనవసరమైన దాన్ని విడిచిపెట్టి అవసరమైన దాన్ని స్వీకరిస్తూ అందరితో కలిసి బ్రతకవచ్చు.
విజ్ఞానం :
ఇది విజ్ఞాన విస్ఫోటనయుగం. సైన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరం ఇది. ఒకప్పుడు గుఱ్ఱంమీద గంటకు 25 కి.మీ వేగంతో ప్రయాణించిన మానవుడు, ఇప్పుడు 30 వేల కి.మీ పైబడిన వేగంతో రోదసిలో ఉపగ్రహాలను తిప్పుతున్నాడు. వార్తను ఒక ప్రాంతం నుండివేరొక ప్రాంతానికి చేర్చడానికి కొన్ని నెలలు పట్టేరోజులు వెళ్ళిపోయి, భూమిమీద ఎక్కడో వేలమైళ్ళ దూరంలో జరిగే విషయాన్ని సెటలైట్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు చూసే రోజులు వచ్చాయి
ఘర్షణ :
వృద్ధులకు ఈ ప్రంచంలో విలువలన్నీ అడుగంటిపోతూ కనిపిస్తున్నాయి; మధ్యవయస్కులు కొత్తపాతల మధ్య ఊగిస లాడుతున్నారు.యువతరానికి తక్కిన వారు ఛాదస్తులు, అడవి మనుషులుగా కనిపిస్తున్నారు.
తలోదారి :
వృద్ధులు, మార్పులను ప్రతిఘటిస్తారు, యువకులు కొత్త మార్పుల కొరకు పరితపిస్తారు. వృద్ధులు ఉమ్మడి కుంటుంబ వ్యవస్థ శిధిలమైపోతోందని పరితపి స్తుంటే, యువకులు ఒంటరి తనం లభించడంలేదని బాధపడతారు. ఈ మార్పును జీర్ణించుకొని యువతరానికి దగ్గరవ్వాలో లేక సనాతన వ్యవస్థకు పట్టంగట్టి పై తరాన్ని గౌరవించాలో తెలియక నలిగిపోతారు మధ్య వయస్కులు.
సమన్వయం :
పల్లెలలో బ్రతికినవారు మహానగరాలలో ఉక్కిరిబిక్కిరవడం సహజం.వారి నర్ధం చేసుకొని మెలగడానికి యువతరం ప్రయత్నించాలి. తాము మారకపోయినా ఫరవాలేదు గాని యువతరానికి ప్రతిక్షణం అడ్డుపడుతూ, తాము బ్రతికినట్లే వారిని బ్రతకమనకుండా ఉండాలి పెద్దతరం.
మార్పులను అవసరాన్ని గుర్తించి,వాటి స్వభావాన్ని అర్ధం చేసుకొని, వాళ్ళ ఆలోచనలను, ప్రవర్తననూ ఆయా పరిస్థితులకు అనుగుణంగా సమన్వయం చేసుకోగలగాలి మధ్యతరం.
వ్యాపార సరళి :
కేవలం నమ్మినంత మాత్రాన ఇంతకు మునుపు చేయని పనులు కొత్తగా చేయడం కష్టమంటారు గానుగెద్దులాంటి మనుషులు. మారదలచుకున్నవాడు ముందు పాత అలవాట్లను వదులుకోవడానికి సిద్ధపడాలి. మనమంతా కొత్త జీవన సూత్రాలను వెతుకుతూ బయలుదేరుతామే గాని తెలిసినవాటిని ఆచరించడానికి ప్రయత్నించం. ఈ బలహీనతను ఆధారంగా చేసుకునే పాతసబ్బులు, పేస్టులకు కొత్తది (శ్రీలిగీ)అని వ్రాసి అమ్ముకుంటారు వ్యాపారవేత్తలు.
ఎలా నమ్మడం :
ఒకసారి ఒకవ్యక్తి కాలుజారి ఒక లోయలో పడిపోతూ చేతికి దొరికిన ఒక ఊడను పట్టుకున్నాడు. క్రిందికి చూస్తే అగాధం పైకి చూస్తే ఆకాశం. ఏం చేయాలో దిక్కుతోచకుండా ఉన్న అతడు ''ఎవరన్నా నన్ను రక్షించేవారున్నారా'' అన్నాడు. ఇంతలో ''నా పైన నీకు విశ్వాసం ఉంటే పట్టుకున్న ఆ ఊడను విడిచిపెట్టు'' అనే గంభీరమైన వాణి ఆ లోయలో ప్రతిధ్వనించింది. వెంటనే ఆ వ్యక్తి ''ఇంకెవరన్నా ఉన్నారా'' అన్నాడు.
సాగిపోండి :
అందుకే భూతకాలపు విలువలనే విశ్వసించాలా! లేక వర్తమానపు విలువపై ఆధారపడాలా? లేక కొత్త పాతలలో ఏది ఉత్తమం అనిగానీ ఆలోచించక ఎదుటి తరంస్థానంలో నిలిచి వారి స్థితిగతులను అర్ధం చేసుకొని ఏది అవసరమో, ఏది అనవసరమో గ్రహించి, అనవసరమైన దాన్ని విడిచిపెట్టి అవసరమైన దాన్ని స్వీకరిస్తూ అందరితో కలిసి బ్రతకవచ్చు.

Post A Comment:
0 comments: