దుర్వార్చన (గరిక)
కౌండిన్య మహాముని వినాయకుని భక్తుడు ఆయన ప్రతి దినము గరికతో 108 సార్లు అష్టోత్తరము చేసిన తర్వాతే దిన చర్యలో పాల్గొనును. ఋషిభార్య ప్రతి దినము అర్చనకు కావలసిన గరికిని సమకూర్చి పతికి ఇచ్చును. ఒకనాడు రాజు ఋషి దంపతులను అందరి పిలిపించి సన్మానము చేసెను. కౌండిన్య మహాముని భార్య వద్ద తోటి ఋషి పత్నుడు రాజమందిరానికి వెళ్ళుచున్నాము నీవు వస్తావా అని పిలచెను. అప్పుడు ఆమె భర్త వద్దకు పోయి మనము కూడా రాజ మందిరానికి వెళదాము అని పిలచెను. అప్పు ఆయన పూజ అయిన పిదప వెళదాము అనిచెప్పెను. ఇంతలో రాజు వద్ద నుండి స్వర్ణ పట్టు పీతాంబరం తీసుకొని, తోటి ఋషిపత్నియుడు కౌండిన్య మహాముని భార్యను చూపిం చెను. అప్పుడు ఆమె పూజ పూర్తికానిదే నేను రాను, రాలేను అని సమాదానము ఇచ్చెను. అంత పూజ పూర్తి అయిన పిదప కౌండిన్య మహాముని భార్యను చూసి మనకు బంగారము రాలేదని భాదపడుతున్నావా అని అడిగెను. అప్పుడు ఆయన స్వామి వారికి అర్పించినటువంటి 2 గరికలను తీసి తన భార్యకు ఇచ్చి నీవు ఇంద్రలోకమునకు పోయి, ఇంద్రుని వద్ద ఈ గరికకు సమానమైన బంగారాన్ని తీసుకురా అని చెప్పెను. ఆమె ఇంద్రలోకానికి వెళ్ళెను. దేవేంద్రుడు ఆమెను చూసి సగర్వంగా ఆహ్వానించెను. పిదప దేవేంద్రుడు అమ్మా మీరు ఇంతదూరం వచ్చినారు మీకు ఏంకావాలి. మీ కోరిక చెప్పండి అనెను. ఆమె సంకోచించుతూ ఉండెను. అంతదేవేంద్రుడు సంకోచించకుండా మీకు కావాల్సింది చెప్పమ్మా అనెను. అప్పుడు ఆమె తన పతి ఇచ్చినటువంటి 2 గరికలను చూపించి దానికి సమానమైన బంగారము ఇవ్వమని అడిగెను. దేవేంద్రుడు ఆమెను చూసి నావద్ద ధనము అనేకము ఉన్నది, ధనాధిపతి కుబేరుడు నా వద్ద ఉన్నాడు. మీకు ఎంత కావాలో అంత తీసుకువెళ్ళండి. అంతేకాని గడ్డిని చూపినన్ను అవమానించకండి అనెను. అందుకు ఆమె నేను పతిమాటను జవదాటను. ఈ గరికకు సమానమైన బంగారము ఇస్తేచాలు అనెను. అప్పుడు దేవేంద్రుడు కుభేరుని పిలిపించి తులాభారము వేయించెను ఒకప్రక్క ఆమె తెచ్చిన గరికను ఉంచి, మరోప్రక్క తనవ్రేలికి ఉన్న ఉంగరాన్ని వేసెను తులాభారము సరితూగలేదు. చివరకు దేవాలోకమందు ఉన్న ధనమంతయు తులాభారంలో వేసెను. అప్పటికి సరితూగలేదు చివరకు, దేవతులు దేవేంద్రునితో సహా తులాభారంపై ఎక్కెను అప్పటికిని సరితూగలేదు, చివరకు గత్యంతరం లేక దేవేంద్రుడు దేవతలతో కూడి కౌండిన్య మహాముని ఆశ్రయం యొద్దకు వచ్చెను. దేవేంద్రుడు మహర్షిని చూసి మీరు ఇచ్చిపంపిన గరిక సామాన్యమైనది కాదని తెలుసుకోలేక పోతిని ఇప్పుడు దేవతలందరూ మీ దాసోహము అన్ని చెప్పెను. అప్పుడు కౌండిన్య మహాముని తన భార్యనుచూసి దేవత లందరూ నీ దాసోహం మయ్యారు, ఇంకా నీకు ఏమి కావాలెనని అడిగినారు, అంతట ఆమె వినాయకుని అర్చించిన గరిక మహిమ తెలియక పోయినందుకు నన్ను క్షమించండి అని వేడుకొనెను. అప్పుడు మహర్షిదేవేంద్రుని చూసి ఇది అంతయు వినాయకుడుకి గరికతో అర్చన చేయడం వల్ల మాకు ఈ భాగ్యం కలిగినని చెప్పి దేవేంద్రుని ఇంద్రలోకానికి పంపిచెను. కాబట్టి గరికతో అర్చన చేయడం విశేషం.
.jpg)
Post A Comment:
0 comments: