జీవితాన్ని స్వస్థతగా ఉంచుకోవాలంటే, మనస్సును స్వస్థతగా ఉంచుకోవడం ఎంతో అవసరం. మనస్నే శరీరాన్ని నడుపుతుంది. శోకం,క్రోధం,గ్లాని, వైరాగ్యం మొదలైనవన్నీ మనస్సులోనే ఉత్పన్నమౌతాయి. వాటియొక్క ప్రభావం రక్తసంచాలనంపైన, మెదడుపైన, నరాలపైన, వీటివల్ల అన్ని అంగాలపైన ఉంటుంది. శోకంవల్ల ఆకలి మందగిస్తుంది. క్రోధంవల్ల రుచి చెడిపోతుంది. ఈర్ష్యా, ద్వేషాలవల్ల ఆనందం దెబ్బతింటుంది. మనం కోరుకుంటే మనస్సును ఉత్సాహంతో నింపి దానిని బలంగా తయారుచేయవచ్చు. నిరుత్సాహంతో నింపి దానిని బలహీనంగా తయారుచేయవచ్చు. మన జయాపజయాలు మన చేతిలోనే ఉన్నాయి. స్వతంత్ర సమరయోధుడు ''చంద్రశేఖర్ ఆజాద్'' పేరులో ఆజాద్ పేరు చేర్చబడిన సంఘటన ఒకటి ఉంది.
23 జులై 1906లో మధ్యప్రదేశ్ 'భావరా' అనే పేరుగల గ్రామంలో పుట్టాడు ఆయన. ఈయన తండ్రి ఏదో విషయంలో కోపగించగా భయంతో 12 సంవత్సరాల పిల్లవాడుగా ఉన్నప్పుడు ఇంటినుండి బొంబాయికి పారిపోయాడు. 15 సంవత్సరముల వయస్సులో బనారస్ చేరి సంస్క ృతం, హిందీ నేర్చుకోవడం మొదలెట్టాడు. అదే సమయంలో దేశంలో గాంధీగారి పిలుపు నందుకొని సహాయ నిరాకరణోద్యమం జరుగుతోంది. ఉత్తేజితుడైన ఈ పిల్లవాడు కుడా ఒక విద్యార్ధుల గుంపులో కలసి పెద్దగా నినాదాలు చేస్తూ సాగిపోయాడు. పోలీసులు అతణ్ణి పట్టుకొని వెళ్ళి మేజిస్ట్రేట్ ముందు నిలబెట్టారు.
మేజిస్ట్రేట్ ఈ పిల్లవాణ్ణి ప్రశ్నించడం మొదలు పెట్టాడు.
నీ పేరు?
ఆజాద్ (స్వాతంత్య్రం)
తండ్రిపేరు?
స్వాధీనత!
ఈ పిల్లవాడు మొండివాడని గ్రహించి చివరి ప్రశ్న వేశాడు
''నీ ఇల్లెక్కడ'?
జైల్లో!
ఇక మేజిస్ట్రేట్కు కోపం ఆగింది కాదు. ఆయన ఆ పిల్ల వాడికి 15 కొరడా దెబ్బలు శిక్ష విధించాడు.
జైలు ఎదురుగా మైదానంలో అందరి ముందు దెబ్బలు తింటూ ప్రతి దెబ్బకు చంద్రశేఖర్ ''వందేమాతరం'' నినాదం ఇస్తూనే ఉన్నాడు. జైలునుంచి చంద్రశేఖర్ బైటికి రాగానే డా|| సంపూర్ణానంద ఆయనకు ''అజాద్' అన్న బిరుదు నిచ్చాడు. అప్పటినుండి ఆయన చంద్రశేఖర్ ఆజాద్గా ప్రసిద్ధికెక్కాడు. సూర్యుడు అస్తమించని సామ్రాజ్యాన్ని 15 సంవత్సరాల పిల్లవాడు తన మాతృభూమిని బానిసత్వము నుండి బైటపడవేయడం కొరకు ఎదిరించడమే నిర్భయత.
సాహసం యొక్క లేమినతమే భయం.అంతేకాని భయానికి వేరేఅస్థిత్వం లేదు. మన ఆదేశానుసారమే మన మస్తిష్కం నడుస్తుంది. ఏ విధంగానైతే మనం మనస్సులో సాహసాన్ని ఉత్పన్నం చేస్తున్నామో అలాగే భయాన్ని నిరాశను కుడా పుట్టిస్తున్నాము. జబ్బుచేసినప్పుడు ఈ నాజబ్బు తగ్గదు అని నిశ్చయించుకున్న తరువాత ఎన్ని మందులు వాడినా ఇక జబ్బు తగ్గదు. అలాగే ఒక విద్యార్ధి నాకిది గుర్తుండదు. నేను ఇది చదవలేను అనుకుంటే అలాగే జరుగుతుంది. భయంచేత నిరాశ, నిరాశచేత ఉత్సాహహీనత దానిచేత దుఃఖం ఉత్పన్నమౌతాయి. మనస్సులోని సంకల్పం చాలా విచిత్రమైంది. ఇటువంటి ఈ సంకల్పం ఒక స్వార్ధరహితమై, సమిష్టి శ్రేయోదాయకమై, నిర్భయమై, పవిత్రమైనదైతే ఎలాగుంటుందో చూడండి.
బ్రిటీష్ ప్రభుత్వం వీరసావర్కర్ (వినాయక్ సావర్కర్) కు ''కాలాపానీ' (The Black waters) శిక్ష విధించింది. ఈ శిక్ష ప్రకారం ఆయన రెండు జన్మల (40 సంవత్సరాలు) వరకు అండమాన్ దీవులలో నరకతుల్యమైన, శ్రమదాయకమైన జైలుశిక్ష అనుభవించడం కొరకు పంపడం జరిగింది. ఆయన మెడలో ''40 సంవత్సరాలు కారాగారవాసం'' అన్న బోర్డు వేలాడ గట్టబడి ఉంది. ఆయన మెడలోని పట్టాను చూచి జైలర్ ''నువ్వు 40 సంవత్సరములు జైలు శిక్ష అనుభవించేవరకు జీవించి ఉంటావా?' అని అడిగాడు. వీరసావర్కర్ ఏమాత్రం జంకక ''నేను తప్పక జీవించి ఉంటాను. కానీ అసలు అంతవరకు భారతావని మీ అధీనంలో ఉంటుందనుకోబోకండి'. అన్నాడు.
చరిత్రపుటలు వీర సావర్కర్కు సాక్ష్యంగా నిలిచాయి. అక్షరాలా అయనన్నట్లేజరిగింది. నిశ్చయం దృఢమైనది, నిర్భయమైనది, పవిత్రమైనది, అయితే దానికి ఈ సృష్టిలోని ఎదురులేదు. అటువంటి నిర్భయతకు విజయమేకాని అపజయం ఎదురుకాదు.
అజ్ఞానం విజ్ఞానం వైపుకు ప్రయాణిస్తుంది, కానీ మూఢత్వం మరణంవైపుకు దారితీస్తుంది. - ఠాగూర్
చరిత్రపుటలు వీర సావర్కర్కు సాక్ష్యంగా నిలిచాయి. అక్షరాలా అయనన్నట్లేజరిగింది. నిశ్చయం దృఢమైనది, నిర్భయమైనది, పవిత్రమైనది, అయితే దానికి ఈ సృష్టిలోని ఎదురులేదు. అటువంటి నిర్భయతకు విజయమేకాని అపజయం ఎదురుకాదు.
అజ్ఞానం విజ్ఞానం వైపుకు ప్రయాణిస్తుంది, కానీ మూఢత్వం మరణంవైపుకు దారితీస్తుంది. - ఠాగూర్
Post A Comment:
0 comments: