చేప - 1 కేజి, బాస్మతి బియ్యం - 1 కప్పు, గోధుమ పిండి - 1 కప్పు, దాల్చిన చెక్క – ఒక ముక్క, లవంగాలు - 4
, ఏలకులు - 4, జీలకర్ర - అర టీ
స్పూను, గులాబీ రేకులు - 1
టీ స్పూను, ఎండు మిరపకాయలు -
2, అల్లం పేస్ట్ - 1
టీ స్పూను, ఉల్లిగడ్డ తరుగు -
1 కప్పు, జీడిపప్పులు -
గుప్పెడు, బాదం పప్పులు -
గుప్పెడు, నెయ్యి - అర కప్పు, రిఫైండ్ అయిల్ - 4 టీ స్పూన్లు, నీళ్ళు –
2 కప్పులు, కొత్తిమీర తరుగు -
2 టీ స్పూన్లు,
ఉప్పు – తగినంత
తయారి :
చేపలను ముళ్ళు లేకుండా శుభ్రపరచి
నీళ్ళుపోసి ముక్క మెత్తబడే వరకు ఉడికించాలి. బాస్మతి బియ్యం ఒక గంటపాటు నాన బెట్టి
చేపలో కలపాలి. చేప మిశ్రమంలో బియ్యం కలిశాక గోధుమ పిండిని కలపాలి. ఈ మిశ్రమాన్ని
పేస్ట్ ల తయారయ్యే వరకు బాగా కలుపుతూ వుండాలి. మిశ్రమమంతా పేస్ట్ ల తయారయిన తరు
వాత నెయ్యి, మసాలాదినుసులన్నీ
కలిపి ఉడి కించాలి. బాణలిలో నూనె వేడిసేసి తరిగిన
ఉల్లిగడ్డ, అల్లం పేస్ట్ కలిపి వేయించి పక్క నుంచుకోవాలి. ఒక బౌల్ లో
హలీమ్ తీసుకుని వేయించిన ఉల్లి తరుగు కొత్తిమీర తరుగు పైన చల్లి నెయ్యి రెండు టీ
స్పూన్లు వేసుకుని వేడివేడిగా తింటే బాగుంటుంది.

Post A Comment:
0 comments: