మటన్ - 1 కేజి, బాస్మతి బియ్యం - 1 కప్పు, గోధుమ పిండి - 1 కప్పు, దాల్చిన చెక్క – ఒక ముక్క, లవంగాలు - 4
, ఏలకులు - 4, జీలకర్ర - అర టీ
స్పూను, గులాబీ రేకులు - 1
టీ స్పూను, ఎండుమిరపకాయలు - 2, అల్లం పేస్ట్ - 1 టీ స్పూను, ఉల్లి తరుగు - 1 కప్పు, జీడిపప్పులు - గుప్పెడు, బాదం పప్పులు - గుప్పెడు, నెయ్యి - అర కప్పు, రిఫైన్డ్ అయిల్ - 4 టీ స్పూన్లు, నీళ్ళు - 2 కప్పులు, కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత
తయారి : మటన్ శుభ్రపరచి నీళ్ళుపోసి ముక్క
మెత్తబడే వరకు (దాదాపు 5 గంటల సమయం) ఉడికించాలి. బాస్మతి బియ్యం ఒక గంటపాటు
నానబెట్టి మటన్ లో కలపాలి. మటన్,
బియ్యం కలిశాక గోధుమ పిండిని కలపాలి. ఈ మిశ్రమాన్ని పేస్ట్ తయారయ్యే వరకు
కలుపుతూ వుండాలి. మిశ్రమమంతా పేస్ట్ ల తయారయిన తరువాత నెయ్యి, మసాలా దినుసులన్నీ కలిపి ఉడికించాలి.
బాణలిలో నూనె వేడిచేసి తరిగిన ఉల్లిగడ్డ, అల్లం పేస్ట్ కలిపి వేయించి పక్కనుంచు కోవాలి. ఒక బౌల్ లో
హలీమ్ తీసుకుని వేయిం చిన ఉల్లిగడ్డ, కొత్తిమీర తరుగు పైన చల్లి నెయ్యి రెండు టీ స్పూన్లు
వేసుకుని వేడివేడిగా తింటే బాగుంటుంది.

Post A Comment:
0 comments: